News April 11, 2025
HYD: ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి: MDUV

మూడు దశాబ్దాల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని మాదిగ దండోర ఉద్యమకారుల వేదిక (ఎండీయూవీ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. బషీర్బాగ్ ప్రెస్క్లబ్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలాన్నారు.
Similar News
News April 14, 2026
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చిత్తూరు కలెక్టర్

అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు దర్గా సర్కిల్లో నిర్వహించిన జయంతిలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలో నడిస్తే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
News April 14, 2026
పెరిగిన మిర్చి రేటు.. రైతులకు అదృష్టం

TG: ఈ ఏడాది మిర్చి రైతులను అదృష్టం వరించింది. అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సాధారణ రకం తేజా మిర్చి క్వింటా రూ.21వేలు, ఏసీ మిర్చి రూ.21,580 పలికింది. చైనా నుంచి ఆర్డర్లు పెరగడంతో డిమాండ్ అధికమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా టమాటా మిర్చి, ఎల్లో మిర్చి ధరలు రూ.40-50వేలు పలికిన <<19251332>>విషయం<<>> తెలిసిందే.
News April 14, 2026
GNT: అమరావతి శాటిలైట్ మ్యాప్ల విడుదల

ప్రపంచ బ్యాంకు అమరావతి శాటిలైట్ మ్యాప్లను విడుదల చేసింది. ఇందులో 2024, 2026 సంవత్సరాల మధ్య వచ్చిన మార్పులను స్పష్టంగా చూపించింది. రాజధాని ఫేజ్-1 పనులకు రూ. 30 వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి గ్లోబల్ ఫండింగ్ సంస్థల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. నిధుల రాకతో అమరావతి నిర్మాణం కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణ దశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అయ్యాయి.


