News February 25, 2025
HYD: ఉష్ణోగ్రతలు పెరుగుతాయి జాగ్రత్త: కలెక్టర్

వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి జాగ్రత్తలు చెప్పారు. కలెక్టరేట్లో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Similar News
News February 23, 2026
భూపాలపల్లి: ప్రజావాణిలో 44 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధించిన అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
News February 23, 2026
అమలాపురంలో అంతర్ జిల్లా కిలాడీ లేడీ అరెస్ట్

అమలాపురం టౌన్లో వరుస సోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగను అరెస్టు చేసినట్లు జిల్లా SP రాహుల్ మీనా సోమవారం తెలిపారు. గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన బండి శివ పార్వతి నుంచి రూ.20.49లక్షల విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 24న అమలాపురంలో సత్యదేవి నగలను దొంగిలించిన కేసులో నిందితురాలిని పట్టుకున్నట్లు SP వెల్లడించారు.
News February 23, 2026
గద్వాల: చట్టాలపై అవగాహనతోనే హక్కుల రక్షణ: అదనపు కలెక్టర్

పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 2013లో పోష్ (POSH) చట్టం అమల్లోకి వచ్చినా, మహిళలపై వేధింపులు కొనసాగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే నిందితులకు శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.


