News February 25, 2025

HYD: ఉష్ణోగ్రతలు పెరుగుతాయి జాగ్రత్త: కలెక్టర్

image

వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి జాగ్రత్తలు చెప్పారు. కలెక్టరేట్‌లో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

Similar News

News November 21, 2025

30న అఖిలపక్ష సమావేశం

image

DEC 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చల అజెండాలపై ఏకాభిప్రాయం, సజావుగా సమావేశాల నిర్వహణే లక్ష్యమని తెలిపారు. ఈసారి SIR అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగనుంది. శీతాకాల సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

News November 21, 2025

ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

image

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 21, 2025

వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్‌చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.