News October 25, 2024
HYD: ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ సేవలు

HYD అఫ్జల్గంజ్ ఉస్మానియా ఆస్పత్రిలో డెర్మటాలజీ ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చినట్లు డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భూమేశ్ కుమార్ వెల్లడించారు. ఉచిత చికిత్స అందిస్తున్నామని నిత్యం 100 మంది ఓపీ వస్తుంటారని, తీవ్రమైన చర్మవ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సి పరీక్షలు చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పీడియాట్రిక్ డెర్మటాలజీ చికిత్స కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
జీహెచ్ఎంసీ వర్సెస్ సీజీజీ.. డేటా బదిలీపై ప్రతిష్టంభన

జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల ఆస్తి పన్ను డేటా బదిలీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. CGG నుంచి వివరాలు అందకపోవడంతో పన్ను వసూళ్లకు బ్రేక్ పడింది. బల్దియా వెబ్సైట్లో కొత్త పోర్టల్ సిద్ధం చేసినా, అసలు డేటా లేకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విభాగాల మధ్య సమన్వయ లోపంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ‘డేటా చిక్కుముడి’ని విడదీయాలని కోరుతున్నారు.
News December 20, 2025
HYD ‘నైట్ లైఫ్’.. కాగితాలకే పరిమితమైన మెట్రో వేళలు

‘నైట్ ఎకానమీ’లో భాగంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. విజన్-2047 లక్ష్యాల్లో వీటిని చేర్చినప్పటికీ మెట్రో రైళ్లు రాత్రి 11 గంటలకే నిలిచిపోతున్నాయి. అర్ధరాత్రి ప్రయాణాలపై ఇప్పటివరకు ఎలాంటి జీవో వెలువడలేదు. వెబ్సైట్లోనూ పాత వేళలే ఉండటంతో, సామాన్యులకు ‘మిడ్నైట్ మెట్రో’ ప్రయాణం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
News December 20, 2025
GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.


