News April 30, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మల్కాజిగిరిలో 37 నామినేషన్లు ఆమోదించగా.. 15 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. 22 మంది బరిలో నిలిచారు. HYD లోక్‌సభలో 8 మంది విత్‌ డ్రా చేసుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. చేవెళ్లలో 46 మందికి ముగ్గురు ఉససంహరించుకొన్నారు. 43 మంది పోటీలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌లో ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇక్కడ 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. SHARE IT

Similar News

News November 1, 2025

HYD: కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి: మంత్రి

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్‌నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభ నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్‌ని గెలిపించాలని కోరారు.

News November 1, 2025

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌‌లో బాంబు బెదిరింపుల కలకలం

image

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్‌ను ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్‌ను పరిశీలిస్తున్నాయి.

News November 1, 2025

HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

image

HYD శంషాబాద్ మండ‌లం చిన్న‌గోల్కొండ‌, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండ‌ర్ పాస్‌లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని విద్యార్థినులు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బ‌స్సులో తాము స్కూల్‌కు వెళ్తామ‌ని.. ఇటీవ‌ల తాము ప్ర‌యాణిస్తున్న బ‌స్సు అండ‌ర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవ‌డంతో ఇబ్బంది ప‌డ్డామ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.