News August 13, 2024

HYD: ఎంబీబీఎస్ సీట్ల దరఖాస్తు గడువు పెంపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలతో గడువు ముగియనుంది. తాజాగా గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 18, 2025

ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

image

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?

News November 18, 2025

ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

image

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?

News November 18, 2025

HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

image

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్‌తో బండి త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా గమనిస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్‌కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.