News May 12, 2024
HYD: ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: సీపీ
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి
HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
News October 9, 2024
గ్రేటర్ HYDలో వ్యర్ధాల నిర్వహణకు కమాండ్ కంట్రోల్
గ్రేటర్లో ఘన వ్యర్ధాల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు GHMC కమిషనర్ తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యర్ధాల నిర్వహణపై GHMC కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన సమావేశం జరిగింది. 11 మంది ఆపరేటర్లు నూతన టెక్నాలజీని వివరించారు. ఈ టెక్నాలజీతో గార్బేజి కలెక్షన్, స్ట్రీట్ స్వీపింగ్, ఫిర్యాదుల పరిష్కారం సులభతరం కానుంది.
News October 9, 2024
HYD: దసరా.. ఊరెళ్లేవారికి ఛార్జీల మోత!
బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.