News April 18, 2024

HYD: ఎన్నికలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.

Similar News

News December 22, 2025

HYD: విలీనం.. జనంపై రూ.800 కోట్ల భారం!

image

ULBs విలీనంతో అభివృద్ధి సంగతేమోగానీ, పన్నుల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తోంది. 27 మున్సిపాలిటీల పరిధిలోని 8 లక్షల ప్రాపర్టీస్ గ్రేటర్ పరిధిలోకి తెచ్చారు. రూ.800 కోట్ల అదనపు పన్ను వసూలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.3,100 కోట్లకు పన్ను వసూళ్లు చేరనున్నాయని అధికారులు Way2Newsకు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ పన్నుల వసూలును పూర్తి చేయాలని వేగంగా పావులు కదుపుతున్నారు.

News December 22, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. జర భద్రం!

image

వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. DEC నెలలోనూ డెంగ్యూ కేసులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10రోజుల్లో నగరంలో 4పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క NOVలోనే 90కిపైగా డెంగ్యూ, వైరల్‌ జ్వరాల కేసులు ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు. దోమల నివారణకు అధికారుల చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 22, 2025

HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

image

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.