News January 10, 2025

HYD: ఎఫ్‌టీఎల్ వివాదానికి త్వరలో పరిష్కారం: రంగనాథ్

image

బుద్ధ భవన్ హైడ్రా కార్యాల‌యంలో దుర్గం చెరువు ప‌రిస‌ర‌వాసుల‌తో కమిషనర్ రంగనాథ్ స‌మావేశం నిర్వహించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో వివాదాల‌కు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో 6 కాల‌నీల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొని వారి నుంచి స‌మాచారాన్ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌ అందజేశారు.

Similar News

News January 25, 2025

HYDలో  ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 

News January 25, 2025

ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News January 25, 2025

HYD: KCR చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి చేశారు: ఎంపీ 

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలని, అప్పుడే అన్నీ సజావుగానే కనిపిస్తాయని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ..కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్‌లో మంత్రివా లేక KCR ఫామ్ హౌస్‌లో పాలేరువా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10ఏళ్లలో KCR చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలోనే చేసి చూపించారని, KTRతేలేని పెట్టుబడులను తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తున్నామన్నారు.