News June 11, 2024
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ను బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మహమ్మద్ వసీం అనే వ్యక్తి 10 సంవత్సరాలుగా దుబాయ్లో ఉండి రాజాసింగ్కు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.
Similar News
News March 22, 2025
HYD: ఇన్స్టాలో పరిచయం.. హోటల్లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.
News March 21, 2025
HYD: మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు

మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకై జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఆమె ఇవాళ పరిశీలించారు. డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
News March 21, 2025
HYD: ‘విద్యార్థి’ ప్రయాణం ప్రమాదం!

సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం స్టూడెంట్స్ సాహసాలు చేస్తూ కాలేజీలకు వెళుతున్నారు. ప్రమాదపు అంచులో ప్రయాణం ఆందోళన కలిగిస్తోందని నగరవాసులు Way2Newsకు తెలిపారు. అమ్మాయిలూ ఫుట్ బోర్డింగ్ చేస్తున్నారు. ఇక అబ్బాయిల పరిస్థితిని పై ఫొటోలో చూడొచ్చు. BNరెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ (గుర్రంగూడ)లో ఈ పరిస్థితి ఉంది. ఈ రూట్లో బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.