News December 3, 2024
HYD: ఎమ్మెల్సీతో మరో ఎమ్మెల్సీ భేటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలో ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను తనదైన శైలిలో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఆయనని.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. అనంతరం పార్టీ విషయాలు, ప్రజా సమస్యలను పరస్పరం చర్చించుకున్నారు.
Similar News
News November 16, 2025
షాద్నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

షాద్నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.
News November 16, 2025
రంగారెడ్డి జిల్లాలో 2 కోట్ల చేపపిల్లల లక్ష్యం

రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు వెయ్యికిపైగా ఉన్నాయి. వాటిలో 2 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరం ఉండగా.. 59 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే జిల్లాలో సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వాటిని కూడా పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా, మరిన్ని చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ తెలిపారు.
News November 15, 2025
రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.


