News December 19, 2024
HYD: ఏటా 2500 మంది చనిపోతున్నారు: రిపోర్ట్

గ్రేటర్ HYD పరిధిలోని 3 కమిషనరేట్లలో ఏటా 2,500 మందికిపైగా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్లుగా రిపోర్టులో తెలిసింది. సిగ్నల్ జంపింగ్ కేసులు ఈ ఏడాదిలో HYD పరిధిలో 2.6 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 75,000 రాచకొండ పరిధిలో 54 వేలకు పైగా నమోదయ్యాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇష్టారాజ్యంగా సిగ్నల్స్ పాటించకుండా దాటేస్తుండటంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు.
Similar News
News October 20, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో ఎత్తుగడ వేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకవేళ సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉంటాడు.
News October 19, 2025
CM సాబ్.. తోడా హాత్ మిలావోనా!

సదర్ సమ్మేళన్లో CM రేవంత్ రెడ్డి యువతలో జోష్ నింపారు. ఓ వైపు యాదవుల బలగం, మరోవైపు దున్నరాజుల విన్యాసాలు వీక్షించేందుకు NTR స్టేడియానికి వేలాది సంఖ్యలో యువకులు తరలివచ్చారు. అంతటి రద్దీలోనూ CMను చూసిన కొందరు ఆయన్ను చరవాణిలో బంధించేందుకు, చేయి కలిపేందుకు ఆసక్తి చూపించారు. వేదిక అలంకరించబోయే ముందు యువతను చూసిన CM స్వయంగా వారి వద్దకు వెళ్లారు. సెక్యూరిటీని పక్కనబెట్టి సింప్లిసిటీని చాటారు.
News October 19, 2025
లేగదూడను చూసి CM మురిసే!

యాదవుల సదర్ అంటే CM రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.