News December 19, 2024

HYD: ఏటా 2500 మంది చనిపోతున్నారు: రిపోర్ట్

image

గ్రేటర్ HYD పరిధిలోని 3 కమిషనరేట్లలో ఏటా 2,500 మందికిపైగా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్లుగా రిపోర్టులో తెలిసింది. సిగ్నల్ జంపింగ్ కేసులు ఈ ఏడాదిలో HYD పరిధిలో 2.6 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 75,000 రాచకొండ పరిధిలో 54 వేలకు పైగా నమోదయ్యాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇష్టారాజ్యంగా సిగ్నల్స్ పాటించకుండా దాటేస్తుండటంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు.

Similar News

News November 13, 2025

HYD: వలపు వల.. మగవాళ్లు జాగ్రత్త!

image

HYDలో వలపు వల విసిరి అమాయకుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందంతో కట్టి పడేయడం, అడ్డదారిలో లాగేయడం ఓ దందాగా మారింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. గంజాయి సరఫరా, ఉద్యోగం ఇప్పిస్తాం, కన్సల్టెన్సీ అని చెబుతూ డబ్బులు అకౌంట్లో పడ్డాక సైడ్ అవుతున్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
SHARE IT

News November 13, 2025

HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్‌కు వైద్యం!

image

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్‌కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT

News November 13, 2025

HYD: గెట్‌ రెడీ.. రేపే కౌంటింగ్

image

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.