News December 19, 2024

HYD: ఏటా 2500 మంది చనిపోతున్నారు: రిపోర్ట్

image

గ్రేటర్ HYD పరిధిలోని 3 కమిషనరేట్లలో ఏటా 2,500 మందికిపైగా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్లుగా రిపోర్టులో తెలిసింది. సిగ్నల్ జంపింగ్ కేసులు ఈ ఏడాదిలో HYD పరిధిలో 2.6 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 75,000 రాచకొండ పరిధిలో 54 వేలకు పైగా నమోదయ్యాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇష్టారాజ్యంగా సిగ్నల్స్ పాటించకుండా దాటేస్తుండటంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు.

Similar News

News November 12, 2025

HYD: జావా కోడింగ్‌పై 4 రోజుల FREE ట్రైనింగ్

image

బాలానగర్‌లోని CITD కేంద్రంలో 4రోజుల జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5 గంటలలోపు tinyurl.com/mvutwhub లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

News November 12, 2025

జూబ్లీ బైపోల్.. ఫలితాలపై ఎవరి ధీమా వారిదే!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా ఫలితాల్లో తమదే విజయమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగిందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సైలెంట్ ఓటింగ్‌తో తమదే గెలుపు అని BRS ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అనంతరం కమలనాథులు సందిగ్ధంలో ఉన్నారు. గెలుపెవరిదో..?

News November 12, 2025

WOW.. HYDలో ఇప్పపువ్వు లడ్డూలు

image

HYDలో నాంపల్లి, శేర్లింగంపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఇప్ప పువ్వు లడ్డూలు కనపడుతున్నాయి. ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలు స్థానిక వ్యాపార రంగంలో కొత్త ఉరవడికి నాంది పలికారు. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూ రక్తహీనత తగ్గించే, వ్యాధి నిరోధకశక్తినిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు HYDలో భీమాబాయి మహిళా సహకార సంఘం ఈ ఉత్పత్తుల ద్వారా ఏడాదికి రూ.1.27 కోట్ల ఆదాయం పొందుతోంది.