News December 19, 2024
HYD: ఏటా 2500 మంది చనిపోతున్నారు: రిపోర్ట్

గ్రేటర్ HYD పరిధిలోని 3 కమిషనరేట్లలో ఏటా 2,500 మందికిపైగా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్లుగా రిపోర్టులో తెలిసింది. సిగ్నల్ జంపింగ్ కేసులు ఈ ఏడాదిలో HYD పరిధిలో 2.6 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 75,000 రాచకొండ పరిధిలో 54 వేలకు పైగా నమోదయ్యాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇష్టారాజ్యంగా సిగ్నల్స్ పాటించకుండా దాటేస్తుండటంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వివరించారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్: నేడే పోలింగ్.. ఓటే ఆయుధం..!

గెలుపు ఓటములను డిసైడ్ చేసేందుకు ఒక్క ఓటు చాలు. ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. మీ ఓటును ఆయుధంగా వాడండి.
> మొత్తం ఓటర్లు: 4,01,365
> పురుషులు: 2,08,561
> మహిళలు: 1,92,779
> ఇతరులు: 25
> బీసీలు: 1.50-1.80 లక్షలు, ముస్లింలు: 96,500, ఎస్సీలు: 26,000, కమ్మ: 17,000, రెడ్లు: 18,000, యాదవులు: 15,000, క్రిస్టియన్లు: 10,000
> కొత్త ఓటర్లు: 12,380 (18-19 ఏళ్లు)
News November 11, 2025
జూబ్లీహిల్స్: పెద్దల స్ఫూర్తితో ఓటేద్దాం పదండి..!

వారికి ఒంట్లో శక్తి లేదు.. అవయవాలు సరిగా పనిచేయవు.. అయినా ఓటు వేసే బాధ్యత మాత్రం మరవలేదు.. జూబ్లీహిల్స్లో 103 మంది వృద్ధులు హోం ఓటింగ్కు అప్లై చేయగా అందులో 101 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన ఇద్దరు అంతకు ముందే చనిపోయారు. అంటే దాదాపు అందరూ ఓటేశారు. శరీరం సహకరించకపోయినా వాళ్లు ఓటేశారు. మరి మిగితా వారు వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితో ఓటేసేందుకు కదిలిరండి.
> మీ ఓటు.. మీ బాధ్యత
News November 11, 2025
HYD: అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

రాజేంద్రనగర్ హనుమాన్నగర్ ప్రాంతానికి ధనుష్ కుమార్(22) హౌస్ కీపింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వస్తానని తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటికి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రితోపాటు చుట్టు పక్కల వెతికారు. సోమవారం వాలంతరి ఏపీఈఆర్ఎల్ వెనుక చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


