News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

Similar News

News October 16, 2025

సీపీఆర్‌తో ప్రాణాలను రక్షించవచ్చు: కలెక్టర్

image

గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) చేసి ప్రాణాలను రక్షించవచ్చని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు సీపీఆర్‌ ఎంతో ఉపయోగమన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 16, 2025

ముత్తారం మండలంలో మహిళా ఆరోగ్య శిబిరం

image

ముత్తారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహిళా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డీ.హెచ్‌.ఎం.ఓ. వాణిశ్రీ, వైద్యాధికారి అమరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. 30–60 ఏళ్ల మధ్య 200 మంది మహిళలకు గర్భకోశ, గర్భాశయ పరీక్షలు నిర్వహించారు.

News October 16, 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!

image

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లుగా ఉంది.