News March 20, 2025
HYD: ఓయూ బంద్కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News October 17, 2025
TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.
News October 17, 2025
దీపావళి 5 రోజుల పండుగ అని మీకు తెలుసా?

దీపావళిని మనం రెండ్రోజులే జరుపుకొంటాం. కానీ ఉత్తర భారత్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ ద్వితీయ వరకు.. మొత్తం 5 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. త్రయోదశి నాడు ధన్తేరస్గా కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. 14వ తిథిన నరక చతుర్ధశి, అమావాస్య రోజు దీపావళి జరుపుకొంటారు. పాడ్యమి రోజున గోవర్ధన పూజ చేసి, బలి చక్రవర్తిని పూజిస్తారు. ద్వితీయ తిథిన భాయ్ దూజ్ వేడుకలుంటాయి.
News October 17, 2025
NRML: 42 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రాని మోహన్ రెడ్డి

మావోయిస్టు పార్టీలోనూ మోహన్ రెడ్డి టెక్నికల్ విభాగంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గాను కొనసాగారు. ఎంత పెద్ద నాయకుడైనా కుటుంబాన్ని, పెరిగిన ఊరిని చూడటానికి అప్పడప్పుడొచ్చిపోతుంటారని విన్నాం. కానీ 42 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన 63 ఏళ్ల మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన గ్రామానికి రాలేదు. ఇప్పుడైనా వస్తారేమో చూడాలి మరి.