News March 20, 2025
HYD: ఓయూ బంద్కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News July 7, 2025
HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.
News July 6, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 105 మందిపై చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.
News July 6, 2025
లోకేశ్తో KTR పదే పదే చర్చలు: సామ రామ్మోహన్

సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడం హాస్యస్పదమని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద రేపు చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. లోకేశ్తో కేటీఆర్ పదే పదే రహస్య మంతనాలు జరపడంపై కూడా సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ డిమాండ్ చేశారు.