News November 26, 2024
HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్న్యూస్

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT
Similar News
News November 11, 2025
జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్లో BJP డిపాజిట్ గల్లంతు!

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
News November 11, 2025
FINAL UPDATE: జూబ్లీహిల్స్లో 48.43% పోలింగ్ నమోదు

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్కు అంటే జూబ్లీహిల్స్లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.
News November 11, 2025
బేగంపేట్ సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు

బేగంపేట్ ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 41, రెవెన్యూశాఖ 29, హోంశాఖకు10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 31, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు రాగా.. ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు. పలు దరఖాస్తులపై వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు.


