News March 21, 2025

HYD: ఓయూ సర్కులర్‌పై హైకోర్టు స్టే

image

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

Similar News

News November 1, 2025

HYD: ప్రముఖులను అందించిన నిజాం కాలేజీ

image

HYD బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలోనే మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, KTR, నాదెండ్ల మనోహర్, ప్రొ.కోదండరాం, అసదుద్దీన్ ఒవైసీ, బాలకృష్ణ, అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ, IPS అధికారులు CVఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ప్రముఖులు చదివారు. శుక్రవారం TG మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ కూడా నిజాం కాలేజీ పూర్వ విద్యార్థే.

News October 31, 2025

HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

image

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్‌ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?

News October 31, 2025

HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

image

1928లో గుజరాత్‌లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్‌ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్‌లో విలీనం అయింది.