News October 19, 2024
HYD: ఓయూ VC ప్రస్థానం!

OUలో విద్యనభ్యసించిన ప్రొ.ఎం.కుమార్ అదే యూనివర్సిటీకి VCగా నియమితులయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధి కొండాపురంకు చెందిన ఆయన, భద్రాచలం GMR పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమా సివిల్ ఇంజినీరింగ్, ఉస్మానియాలో B.Tech, JNTUలో M.Tech, IIT బాంబే నుంచి Ph.D పట్టా అందుకున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా, ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్తో పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అనేక అవార్డులు సైతం పొందారు.
Similar News
News October 19, 2025
జూబ్లీ బరిలో ఎవ్వరూ తగ్గట్లేదుగా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చేనెల 11న జరిగే ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం జోరుపెంచాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 40 మందిని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించగా గులాబీ దళం నుంచి 60 మందిని నియమించింది. ఇరు పార్టీలు కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. రాష్ట్ర రాజకీయాలు గ్రౌండ్ లెవల్కు వచ్చాయనే చర్చ నడుస్తోంది.
News October 19, 2025
HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్ పేరుతో మోసం

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్ ఐటీ ఇంజినీర్ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్డీ లెటర్హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్కు బదిలీ చేశారు.
News October 19, 2025
జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్లో 27కు 23, ఫిలింనగర్లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్నగర్లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.