News June 17, 2024
HYD: కట్ట మైసమ్మ గుడిలోకి వరద నీరు
ఫిలింనగర్ బసవతారకనగర్ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్నగర్ నుంచి బాలిరెడ్డినగర్ మీదుగా పారామౌంట్హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.
Similar News
News September 22, 2024
హైదరాబాద్కు వర్ష సూచన⛈️
East HYDకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్నగర్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, రామంతాపూర్, అంబర్పేట, మీర్పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
News September 22, 2024
HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
News September 22, 2024
HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!
HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.