News March 24, 2024

HYD: కడుపు కోసి.. దారుణంగా చంపాడు..!

image

HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్‌ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

News October 27, 2025

జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్‌పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

News October 27, 2025

జూబ్లీ బైపోల్: కమలానికి టీడీపీ, జనసేన సహకారం?

image

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నడుస్తోంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేనలు జూబ్లీహిల్స్ బై పోల్‌లో కమలానికి మద్దతునిస్తున్నట్లు సమాచారం. ఆ 2 పార్టీల నాయకులు అంతర్గతంగా బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కమలం విజయం సాధిస్తే తమ వల్లే విజయం సాధించిందని చెప్పుకునేందుకు అవకాశముంటుందని ఇరుపార్టీల అధినేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.