News September 7, 2024
HYD కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీలుగా వీరే!

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ IPS ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.
Similar News
News December 11, 2025
షాద్నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

షాద్నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
News December 11, 2025
రంగారెడ్డిలో BRS vs కాంగ్రెస్

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నందిగామ, జిల్లేడ్ చౌదరిగూడం, కొత్తూరు మండలాలు బోణి కొట్టాయి. నందిగామ (M) బుగ్గోనితండా సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన బుగ్గసాలయ్య, జిల్లేడ్(M) ముష్టిపల్లి సర్పంచ్గా BRS బలపరిచిన జంగయ్య గెలుపొందారు. దీంతో BRS, కాంగ్రెస్ మధ్య ఫైట్ టఫ్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తూరు (M) మల్లాపూర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ మీనాక్షి దశరథ్ గెలుపొందారు.
News December 11, 2025
రంగారెడ్డి: 6 ఏకగ్రీవం.. 168 GPలకు ఎన్నిక

రంగారెడ్డి జిల్లాలో నేడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 7 మండలాల పరిధి 174 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 6 GPలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గురువారం 168 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటతో పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత ఫలితాలు వస్తాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 1340 వార్డులు ఉండగా.. ఇప్పటికే 190 ఏకగ్రీవం అయ్యాయి.


