News February 15, 2025
HYD: కళ్లు చెదిరేలా ఆటో డ్రైవర్ కొడుకు ఆర్ట్స్

HYD నగరానికి చెందిన రాజేష్ నాయక్ అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆర్టిస్ట్ రాజేష్ నాయక్ ఆటో డ్రైవర్ కొడుకు కావడం గర్వంగా ఉందన్నారు. ఆటోలు నడపడం ఎంత ఇష్టమో, వాటిని తన ఇతివృత్తంగా చేసుకోవడం కూడా అంతే ఇష్టం అని తెలిపారు. ఈ ఆర్ట్ వర్క్స్ సృష్టించడానికి రెక్జిన్, మెటల్ మొదలైన వాటిని ఉపయోగించినట్లు తెలిపారు. X వేదికగా హైదరాబాద్ ప్రముఖ జర్నలిస్ట్ రాజేశ్వరి అతడిని అభినందించారు.
Similar News
News November 26, 2025
MDK: పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్ధబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు వున్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. MDKలో 492, SRDలో 613, SDPTలో 508 జీపీలు ఉన్నాయి.
News November 26, 2025
సిద్దిపేట: రేపు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఉద్దేశించి దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద తెలిపారు. ఈ ఆటల పోటీలను డిగ్రీ కళాశాల పక్కన ఉన్న క్రీడా స్టేడియంలో జరుపబడతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. గెలుపొందిన మొదటి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.
News November 26, 2025
భీమవరంలో మెప్మా జాబ్ మేళా ప్రారంభం

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో, నిపుణ సహకారంతో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు.


