News June 29, 2024
HYD: కస్టమర్ వెళ్లిపోయాక ఏటీఎంలో నుంచి వచ్చిన డబ్బు

ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తర్వాత నగదు ప్రత్యక్షమైన ఘటన HYD పాతబస్తీ హాషామాబాద్లో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్ టవర్గల్లీ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో రూ.20 వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బును ఏఎస్సై తీసుకొని బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వగా కస్టమర్కు ఇస్తామన్నారు.
Similar News
News October 14, 2025
HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

HYD జూబ్లీహిల్స్ రహమత్నగర్లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.
News October 14, 2025
HYD: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయిన తండ్రి, కూతుళ్లు..!

HYD LB నగర్కు చెందిన RTC ఉద్యోగి M.రామకృష్ణ(49), కూతురు మిథాలీ(23) ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయారు. AUG 26న వారి స్నేహితుడు పంపిన LF వర్క్ అనే అప్లికేషన్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టాడు. ప్రారంభంలో కొంత రాబడి చూపించగా మొత్తం రూ.1,35,210 ఇన్వెస్ట్ చేశాడు. కూతురు ఇన్వెస్ట్ చేసిన రూ.86,220 తిరిగి డ్రా చేసుకోలేకపోయారు. మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదు చేశారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
News October 14, 2025
HYD: సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల అవస్థలు

సమయానికి గమ్యం చేరుకోవాలని ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా యువకులు ప్రయాణం చేస్తున్నా దృశ్యాలు హయత్నగర్లో కనిపించాయి. అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిత్యం ఇదే పరిస్థితి ఉందని, సంబంధిత అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.