News November 28, 2024
HYD: కాంగ్రెస్ను బద్నాం చేద్దామని BRS ప్లాన్: కల్వ సుజాత

BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 20, 2025
చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.
News November 20, 2025
GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారని మండిపడ్డారు.
News November 20, 2025
వికారాబాద్ కోర్టు చరిత్రలో తొలి సంచలన తీర్పు

VKB జిల్లా కోర్టు చరిత్రలో మొదటిసారిగా ఉరిశిక్షను విధిస్తూ గురువారం డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. హత్యకు గురైన ఘటన 2019 ఆగస్టు 5న VKBలో చోటుచేసుకుంది. గృహ కలహాల నేపథ్యంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. కోర్టు నిందితుడికి కఠినమైన శిక్షను విధించింది.


