News December 3, 2024

HYD: కానిస్టేబుల్ నాగమణి అంత్యక్రియలు పూర్తి

image

పరువు హత్యకు గురైన కానిస్టేబుల్ నాగమణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో హయత్‌నగర్ పోలీసులు దహన సంస్కారాలు చేశారు. అయితే, నిందితుడు పరమేశ్‌పై 103(1) BNS కింద FIR నమోదు చేశారు. అతడి కోసం గాలింపు‌ కొనసాగుతోంది.

Similar News

News January 16, 2025

హైదరాబాద్: PhD అడ్మిషన్స్-2025 నోటిఫికేషన్

image

OUలో 2025 PhD అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ విడుదైంది. JAN 24 నుంచి FEB 23 వరకు అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2వేల లేట్‌ఫీతో FEB 24 నుంచి MAR 5 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కేటగిరీ-2 కింద భర్తీ చేయనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.

News January 16, 2025

నార్సింగి జంట హత్యల్లో మరో ట్విస్ట్

image

పుప్పాలగూడలో <<15160567>>జంటహత్యలు<<>> నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. క్రైమ్ స్పాట్‌లో వారి ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై రాయితో కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 11న మర్డర్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బిందుతో సాకేత్ వ్యభిచారం చేపించినట్లు తెలిసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వీరిని హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం.

News January 16, 2025

HYD దగ్గరలో అందమైన టూరింగ్ స్పాట్

image

వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి రిజర్వాయర్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ 30 నిమిషాలకు సింగిల్ సీటర్‌కిరూ.300, డబుల్ సీటర్‌కి రూ.400గా నిర్ణయంచారు. ఈ బోటింగ్ సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 10 ఏళ్ల‌లోపు పిల్లలకు ప్రవేశం లేదు.