News April 1, 2025

HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

image

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడి‌షరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్‌పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 13, 2025

A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

image

మంగళంపేటలో 75.74ఎకరాలకే పట్టాలు ఉండగా.. పెద్దిరెడ్డి కుటుంబం 32.63ఎకరాల అటవీ భూమిని తమ స్థలంలో కలిపేసుకున్నారని PCCFచలపతిరావు వెల్లడించారు. ‘ఏ1గా మిథున్ రెడ్డి, ఏ2గా రామచంద్రా రెడ్డి, ఏ3గా ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాం. అటవీ భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసి ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది’ అని ఆయన చెప్పారు.

News November 13, 2025

భద్రాద్రి జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు

image

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరమన్నారు. 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14,500 ఎకరాల లక్ష్యంలో 8,163 ఎకరాలకు చేరామన్నారు.

News November 13, 2025

ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.