News September 9, 2024

HYD: కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించిన స్పీకర్

image

పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

image

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్‌వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.

News September 18, 2025

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

image

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్‌ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!

News September 18, 2025

మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి సందడి

image

కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు.. ఇవన్నీ మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి కొలువుదీరనున్నాయి. 10 రోజుల పాటు నగర ప్రజలను ఆకట్టుకోనున్నాయి. పల్లె గొప్పదనం చెప్పేలా.. పల్లె రుచులు తెలుసుకొనేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శిల్పారామంలో సరస్ మేళా రేపు ప్రారంభం కానుంది. 29వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.