News October 6, 2024
HYD: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె శనివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన కుమార్తెకు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. KPHB ఇందు విల్లాస్లో రాజేంద్రప్రసాద్ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చి గాయత్రి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆదివారం కేపీహెచ్బీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 15, 2025
మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
News October 15, 2025
HYD: ఎన్నికల వేళ.. జ్యోతిషులు ఫుల్ బిబీ

ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇంకా నామినేషన్ వేయకముందే వారిలో ఒకరకమైన ఆందోళన.. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు ఏ రోజు మంచిదో చూసుకొని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే సిటీలో పంచాంగ కర్తలు, జ్యోతిషులు బిబీ.. బిజీగా మారారు. పేరు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ప్రకారం జాతకం చూస్తూ ఎప్పుడు నామినేషన్ వేయాలో, ఏమేం పూజలు చేయాలో చెబుతున్నారు.