News January 24, 2025
HYD: కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలి: మంత్రి

కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
Similar News
News November 13, 2025
NRPT: నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి

జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ అధ్యక్షతన డీఎల్ఎస్సీ( డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఇసుక రిచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాహనాలకు జీపీఎస్ మార్చాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్నారు.
News November 13, 2025
ఊట్కూర్: వే2న్యూస్ ఎఫెక్ట్.. PHC కూల్చివేతకు ఆదేశాలు

ఊట్కూర్ మండల కేంద్రంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ‘శిథిలావస్థగా PHC భవనం..’Way2News’ ఫోకస్! ‘ శీర్షికతో ఈ నెల 1న కథనం ప్రచురితమైంది. గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పాత భవన నాణ్యతను నిపుణులతో పరిశీలించి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.


