News February 14, 2025

HYD: కుంభమేళాకు వెళ్తూ యాక్సిడెంట్.. వ్యక్తి దుర్మరణం

image

కుంభమేళాకు వెళ్తున్న HYD వాసులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంగరకలాన్‌కు చెందిన సంపత్(25), ఉప్పుగూడకు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్ బుధవారం బయలుదేరారు. నిజామాబాద్‌లోని బాల్కొండ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2025

HYD: భారీగా పెరిగిన నీటి వినియోగం

image

హైదరాబాద్ మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో నీటి వినియోగం కూడా భారీగా పెరిగింది. అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 1,12,926 ట్యాంకర్ల నీటిని ఉపయోగించగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1,50,000 ట్యాంకర్లు బుక్ చేశారని జలమండలి ఫిబ్రవరి నెలకు సంబంధించి నివేదికలో పేర్కొంది.

News March 15, 2025

సమ్మర్ ఎఫెక్ట్… జూ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు

image

ఎండలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో జూ పార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంక్లోజర్ల వద్ద స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. పక్షులు ఇబ్బంది పడకుండా వాటి చుట్టూ గడ్డి ఏర్పాటు చేశారు. బాతుల రక్షణకు షేడ్ నెట్స్ ఉపయోగిస్తున్నారు.

News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

error: Content is protected !!