News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.
Similar News
News March 28, 2025
బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.
News March 28, 2025
అసిఫాబాద్: కానిస్టేబుల్ను అభినందించిన ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాగజ్ నగర్ పట్టణంలో ఇద్దరు దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఐడి పాలిటి కానిస్టేబుల్ రాజును జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు పోలీస్ శాఖ తరపున ప్రశంస పత్రాన్ని అందించారు. వీరితో కాగాజ్నగర్ డిఎస్పీ రామానుజన్ ఉన్నారు.
News March 28, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు.!

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 9,198 మంది రెగ్యూలర్ విద్యార్థులకు గాను 9,175 మంది, గతంలో ఫెయిలైన 134 మంది విద్యార్థులకు గాను 118 మంది హాజరయ్యారు. మొత్తం 9,332 మందికి 9,293 విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.