News August 9, 2024
HYD: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి

జవహర్నగర్లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.
Similar News
News January 6, 2026
HYD: కవిత కాంగ్రెస్లో చేరొచ్చు: కాంగ్రెస్ MLA

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ MLA మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR కూతురు, MLC కవిత కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా, గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్లో చేరారని గుర్తుచేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది.
News January 6, 2026
వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్లో ప్రచురించారు.
News January 6, 2026
HYD: ఈ పథకంతో రూ.50వేలు సాయం

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC), ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా మిస్కీనో కే లియే పథకాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి tgobmms.cgg.gov.in పోర్టల్లో ప్రారంభమయ్యాయి. మైనారిటీ మహిళా యోజనలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, ఆర్ఫన్లు, సింగిల్ మహిళలకు రూ.50,000 సహాయం పొందవచ్చని మెయినాబాద్ ఎంపీడీవో సంధ్య తెలిపారు.


