News July 1, 2024

HYD: కూచిపూడి నాట్యంలో వైష్ణవి రంగప్రవేశం

image

HYD రవీంద్రభారతిలో ఆదివారం మైత్రి నాట్యాలయ స్కూల్‌ ఆఫ్ భరతనాట్యం అండ్‌ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు శిరిణికాంత్‌ శిష్యురాలైన వైష్ణవి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా జావళి, తిల్లాన, శ్రీఘననాథం, ఓంకార, తరంగం తదితర అంశాల్లో నర్తించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరై వైష్ణవిని సత్కరించి అభినందించారు.

Similar News

News October 11, 2024

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి

image

తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.

News October 11, 2024

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

image

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని సీఎస్ ప్రకటించారు.

News October 10, 2024

BREAKING.. HYD: విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.