News March 28, 2025
HYD: కూరల్లో నూనె అధికంగా వాడుతున్నారా?

కూరల్లో నూనె అధికంగా వాడేవారికి HYD ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI సూచించిన సూచనలను ట్వీట్ చేశారు. తక్కువ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిదని, ఊబకాయం వంటివి రాకుండా ఉండే అవకాశం ఉందన్నారు. రోజూ వాడే నూనెలో 10% నూనె తగ్గించినా గుండెపోటు, షుగర్, బీపీ లాంటివి వచ్చే రిస్క్ తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నూనె తక్కువగా వాడాలని FSO పవన్ కుమార్ సూచించారు.
Similar News
News October 21, 2025
పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులు చేయాలి: కలెక్టర్

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఐఐసీ జడ్ఎంను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలపై ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షించారు. 3 కిలోమీటర్ల మేర భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 21, 2025
రాజోలి: పిడుగుపాటుకు రైతు మృతి

రాజోలి మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో ఉదయం పొలం పనులకు వెళ్లిన కురువ మద్దిలేటి (41) మంగళవారం కురిసిన ఉరుములుతో కూడిన వర్షానికి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పొలం పనులకని వెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.