News September 24, 2024

HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే

image

కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.

Similar News

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

image

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్.. ప్రజాభవన్‌లో వార్ రూమ్

image

8, 9 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పనులు మరింత వేగవంతం చేసేందుకు, మీట్‌ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

News December 3, 2025

HYD: నేతలను వెంటాడుతున్న నిరుద్యోగం

image

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇది రాజకీయంగా ఎదగాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా రాణిద్దామనుకునేలోపే మున్సిపాలిటీ చేశారు. తీరా పట్టణాలను బల్దియాలో విలీనం చేస్తుండడంతో రాజకీయ అవకాశాలు 30%పైగా తగ్గుముఖం పట్టనున్నాయి. నిరుద్యోగం విద్యార్థులనే కాదు.. నాయకులను సైతం వెంటాడుతోంది. మహా నగరంలో రాజకీయంగా ఎదగడం ఎలా? అని ఆలోచనలో పడ్డారు.