News April 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారా..? పోలీసుల హెచ్చరిక

image

HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT

Similar News

News January 17, 2025

ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

image

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

News January 17, 2025

రంగారెడ్డి జిల్లా వెదర్ అప్డేట్ @ AM

image

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. చందనవెల్లిలో 13.5℃, రెడ్డిపల్లె 14.2, కాసులాబాద్, తాళ్లపల్లి 14.3, షాబాద్, చుక్కాపూర్, ఎలిమినేడు 14.6, మీర్‌ఖాన్‌పేట 14.7, కడ్తాల్, రాచూలూరు 15, HCU, ఆరుట్ల 15.1, కేతిరెడ్డిపల్లి, ఇబ్రహీంపట్నం 15.2, యాచారం, శంషాబాద్, రాజేంద్రనగర్, గునగల్ 15.3, దండుమైలారం 15.5, తొమ్మిదిరేకుల, సంగం 15.6, అమీర్‌పేట 15.6, కందువాడలో 15.7℃గా నమోదైంది.

News January 17, 2025

HYD: ప్రకటనకు విరుద్ధంగా RTC ఛార్జీల బాదుడు..!

image

సంక్రాంతి పండుగ వేళ తిరుగు ప్రయాణంలో JAN 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు స్పెషల్ బస్సుల్లో అమలులో ఉంటాయని ప్రకటించిన ఆర్టీసీ అందుకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. MHBD జిల్లా తొర్రూరు నుంచి మేడ్చల్ జిల్లా ఉప్పల్ X రోడ్డు వెళ్లే సంక్రాంతి స్పెషల్ బస్సులో నేడు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. మిగతా చోట్ల సైతం వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.