News April 6, 2024
HYD: కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారా..? పోలీసుల హెచ్చరిక
HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT
Similar News
News January 18, 2025
ఉప్పల్లో బస్సు కింద పడి మృతి (UPDATE)
ఉప్పల్ డిపోనకు చెందిన RTC బస్సు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటనసాయంత్రం జరిగింది. పూర్తి వివరాలు.. ఉప్పల్ బస్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (TSU9Z 0280) నల్ల చెరువు మీదుగా వెళ్తోంది. కట్ట మీద ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా వెనుక టైర్ కింద పడ్డాడు. చక్రాలు అతని పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. అతను ఎవరు? ఎందుకు బస్సు కింద పడి చనిపోయాడో వివరాలు తెలియాల్సి ఉంది.
News January 18, 2025
అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ విచారణ
అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News January 18, 2025
HYD: సినిమా ఛాన్స్ అంటూ యువతిపై లైంగిక దాడి
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన బాధితురాలి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.