News April 29, 2024

HYD: కొత్తగా 14 లక్షల ఓటర్లు నమోదు

image

HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్‌లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

News November 21, 2025

హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

image

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్‌కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.