News September 10, 2024

HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)

image

ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.

Similar News

News November 15, 2025

HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

image

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.

News November 15, 2025

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

image

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.

News November 15, 2025

శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

image

హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్‌ను నిన్న రాత్రి ఎఫ్‌జెడ్–436 విమానం ద్వారా దుబాయ్‌కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్‌లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.