News May 14, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.23,87,06,012 నగదు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Similar News

News October 7, 2024

HYD: బతుకమ్మ సంబరాల్లో ముస్లిం నాయకులు

image

HYD చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పలువురు ముస్లిం నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TPCC మైనార్టీ సెల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలను గౌరవించడం భారత పౌరుడిగా మన బాధ్యత అని అన్నారు.

News October 7, 2024

HYD: గాంధీ నుంచి జైనూరు ఆదివాసి మహిళ డిశ్చార్జ్

image

ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమురం భీమ్ జిల్లా జైనూరుకు చెందిన ఆదివాసి మహిళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పూర్తి కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. అలాగే కొంత నగదు, దుస్తులను అందజేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

News October 7, 2024

రేపు GHMC ఆఫీస్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు

image

జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్, సైన్లైన్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.