News September 19, 2024

HYD: గణనాథుడిని దర్శించుకున్న KTR

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా HYD కుషాయిగూడలోని TSIIC కాలనీలో BRS రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ వారు భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుడి ప్రత్యేక పూజలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఉప్పల్ నియోజకవర్గ MLA బండారి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, BRS పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News October 23, 2025

సికింద్రాబాద్: ప్రయాణికులతో ‘పరిచయ కార్యక్రమం’

image

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీఎం సరితా దేవి ఆదేశంతో ఈరోజు కండక్టర్, వీబీఓ గోపు శ్రీనివాస్ సికింద్రాబాద్ టు వర్గల్ బస్ ప్రయాణికులతో పరిచయం చేసుకున్నారు. రూట్ వివరాలు, సమయ పట్టిక, ఆర్టీసీ ఆఫర్స్, సేవలు, సోషల్ మీడియా, సైట్లపై వివరించారు.

News October 23, 2025

పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

image

పోచారంలో‌ కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్‌ చెప్పిన ప్లేస్‌ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.