News July 28, 2024
HYD: గాంధీఆస్పత్రిలో ఓపీ తీసుకోవడం చాలా ఈజీ..!

HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోగులు, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు ఓపీ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అలాంటి వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు.ఇక.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఓపీ టోకెన్ నంబర్ వస్తుందని, తద్వారా కౌంటర్లో ఓపీ రిజిస్ట్రేషన్ ఫామ్ అందిస్తారన్నారు. అనంతరం వెంటనే వైద్యం చేయించుకోవచ్చన్నారు
Similar News
News November 2, 2025
HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.
News November 2, 2025
HYD: TRPలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


