News September 29, 2024

HYD: గాంధీలో పరిశోధనకు రచయిత్రి పార్థివదేహం

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్‌నగర్‌లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.

Similar News

News November 28, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

image

హైదరాబాద్‌లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.

News November 28, 2025

HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

image

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.

News November 28, 2025

HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

image

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.