News September 29, 2024

HYD: గాంధీలో పరిశోధనకు రచయిత్రి పార్థివదేహం

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్‌నగర్‌లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.

Similar News

News October 29, 2025

జూబ్లీహిల్స్ ప్రచారంపై.. మొంథా ఎఫెక్ట్

image

HYDలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJPలు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వర్షానికి ప్రభావితమైంది. దీనికారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని త్వరగా ముగించారు. వర్షాల నుంచి ఉపశమనం కోసం అఖిలపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.

News October 29, 2025

శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

image

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్‌ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్‌ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.

News October 29, 2025

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

image

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.