News May 21, 2024

HYD: గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. అధికారులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో కొద్ది గంటల పాటు కరెంట్ లేదని ఓ వీడియోను సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీనిపై ఆరా తీసిన అధికారులు అది కొన్నేళ్ల కిందట తీసిన వీడియోగా గుర్తించారు. ఆసుపత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 1, 2025

పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

image

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

News December 1, 2025

HYD మెట్రో‌లో ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగాలు

image

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్‌లో సైతం ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

News December 1, 2025

పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

image

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.