News March 19, 2025
HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.
Similar News
News November 18, 2025
HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో 15 రోజుల్లోనే 18 మందికిపైగా టైఫాయిడ్, డయేరియా, శ్వాస సంబంధిత రుగ్మతలతో అడ్మిట్ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. కాచి చల్లార్చిన నీళ్లు, మసాలా దినుసుల కషాయం తాగటం, ముక్కులోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.
News November 18, 2025
HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో 15 రోజుల్లోనే 18 మందికిపైగా టైఫాయిడ్, డయేరియా, శ్వాస సంబంధిత రుగ్మతలతో అడ్మిట్ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. కాచి చల్లార్చిన నీళ్లు, మసాలా దినుసుల కషాయం తాగటం, ముక్కులోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.
News November 18, 2025
HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT


