News November 17, 2024
HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్కుమార్ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 30, 2025
HYD: కేటీఆర్ మాటలు జాగ్రత్త.. సహించేది లేదు: దయాకర్

ముఖ్యమంత్రిపై నోరు జారితే సహించేది లేదని, కేటీఆర్ మాటలు అదుపులో పెట్టుకోవాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చనగని దయాకర్ హెచ్చరించారు. కేటీఆర్కు లాగు లేనప్పుడే మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాల్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహేష్ గౌడ్ 1984 నుండే రాజకీయాల్లో ఉండి, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారని, కేటీఆర్ మాట్లాడే విధానం మార్చుకోవాలని సూచించారు.
News November 30, 2025
HYD: పర్సనల్ వీడియోలతో బెదిరింపు.. అమ్మాయిపై దాడి

వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్న తేజ, తనతో కలిసి ఉంటున్న లక్ష్మి (25)పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున బంజారాహిల్స్లోని జరిగింది. బ్లాక్మెయిల్ చేయడాన్ని ప్రతిఘటించిన లక్ష్మి ఛాతీపై తేజ పొడవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి బావ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 30, 2025
HYD: రేపు విలీనం.. రంగం సిద్ధం?

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ మహాత్తర పునర్వ్యవస్థీకరణ కోసం అధికారులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. డిసెంబర్ 1న ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. విలీన ప్రక్రియ పూర్తి కాగానే ఈ స్థానిక సంస్థలు GHMC కమిషనర్ అధీన పరిపాలనా వ్యవస్థలోకి సమీకృతం కానున్నాయి. తదుపరి పాలన GHMC 1995 చట్టం ప్రతిపత్తిలో కొనసాగనుంది.


