News November 17, 2024
HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్కుమార్ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
గాంధీ ఆస్పత్రిలో యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స

భూపాలపల్లి జిల్లా యువకుడు విజయ్కుమార్కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ & అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. విషం తాగిన తర్వాత ఏర్పడిన సబ్గ్లోట్టిక్ ట్రాకియల్ స్టెనోసిస్ సమస్య తీవ్రం కావడంతో ఈ నెల 12న సీటీవీఎస్, ENT విభాగాల వైద్యులు కలిసి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. సీటీవీఎస్ డా.జి. రవీంద్ర, ENT డా. భూపేందర్ రాథోడ్లను సూపరింటెండెంట్ డా.వాణి అభినందించారు.
News November 26, 2025
GHMCలో విలీనం.. తర్వాత బాదుడే.. బాదుడు

GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అధికారికంగా ముగిసిన అనంతరం ఆయా ప్రాంతాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పన్నులు పడే అవకాశముంది. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విధి, విధానాలు ప్రభుత్వం ఇంకా పూర్తిగా రూపొందించలేదు. విలీన ప్రక్రియ సమగ్రంగా ముగిసిన తర్వాత పన్నుల లెక్క తేలుతుంది. దీనిపై మీ కామెంట్
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.


