News March 26, 2025

HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీ‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.

Similar News

News November 27, 2025

తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల

image

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.

News November 27, 2025

తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల

image

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.

News November 27, 2025

సూర్యాపేట: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి

image

పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ పరిశీలకులు రవి అన్నారు. కలెక్టర్ వీసీ ఛాంబర్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్లకు అవగాహన కల్పించి
తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని అన్నారు.