News February 9, 2025

HYD: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ (PHOTO)

image

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది ఓ డాక్టర్. నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే యాక్సిడెంట్‌లో డా. నంగి భూమిక(24) తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్‌ బృందం ఐదుగురు పేషంట్లకు ఆర్గాన్లు అవసరమని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భూమిక గుండె, లీవర్, కళ్లు, కిడ్నీలను దానం చేసి ఐదుగురికి ప్రాణం పోశారు.

Similar News

News November 24, 2025

ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

image

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్‌ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 24, 2025

పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు ప్రాధాన్యం: ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 42 మంది ఫిర్యాదుదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి, వాటిని సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.

News November 24, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.