News April 12, 2025

HYD: చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్ల పరుగులు

image

సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే మరిన్ని రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే పలు దూరప్రాంత రైళ్లు ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌కు మళ్లించారు. వేసవి ప్రత్యేక రైళ్లు కూడా చర్లపల్లి నుంచి ప్రయాణిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి మరిన్ని రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News February 24, 2026

RR: వేరుశనగ పంట వేశారా?

image

రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశెనగపై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా.సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. ఆకు తినే పురుగులు, వేరు పురుగుల నియంత్రణకు ఫెరోమోన్ ట్రాప్స్ వినియోగం వివరించారు.

News February 24, 2026

రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.

News February 24, 2026

వంటింటి చిట్కాలు

image

* బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ను వేయండి. బిస్కెట్లు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
* చక్కెరను పొడి చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేస్తే ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.
* నిమ్మజాతి పండ్లూ, టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే వాటిల్లోని సువాసన తగ్గిపోతుంది.
* వంటింట్లో వాడే స్పాంజిలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు, దుర్వాసన పోతాయి.