News April 12, 2025

HYD: చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్ల పరుగులు

image

సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే మరిన్ని రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే పలు దూరప్రాంత రైళ్లు ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌కు మళ్లించారు. వేసవి ప్రత్యేక రైళ్లు కూడా చర్లపల్లి నుంచి ప్రయాణిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి మరిన్ని రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News December 4, 2025

బల్దియా.. బడా హోగయా!

image

ORR సమీపంలోని 20 పట్టణాలు, 7 నగరాలు GHMCలో విలీనమయ్యాయి. DEC 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీంతో విస్తీర్ణం, జనసాంద్రత, పరిపాలనా విభాగాల పరంగా GHMC దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, నగరాల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్‌లు, జోనల్ కమిషనర్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

News December 3, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ: భద్రాద్రి కలెక్టర్
✓టేకులపల్లి: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
✓పినపాక: ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలి: సీఐ
✓సైబర్ నేరాల నివారణకు 42 రోజులు పాటు అవగాహన
✓చర్ల: మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు: CPIML
✓ జిల్లాలో 6 బయో ఇన్ పుట్ సెంటర్లు: కేంద్ర సహాయ మంత్రి
✓కొత్తగూడెం: రైల్వే ట్రాక్ పై నాటు బాంబు కలకలం