News May 3, 2024

HYD: చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు గాయాలు

image

చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 3, 2025

ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

image

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్‌వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

image

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్‌పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.