News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
Similar News
News April 23, 2025
బాపట్ల జిల్లాలో 83.96% ఉత్తీర్ణత..!

బుధవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బాపట్ల జిల్లా 83.96% ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 16,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 13,586 మంది ఉత్తీర్ణత సాధించారు. 8,143 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 6,615మంది 81.24% తో పాసయ్యారు. 8,039 బాలికలు పరీక్షకు హాజరు కాగా 6,971మంది 86.71%తో ముందంజలో ఉన్నారు.
News April 23, 2025
RED ALERT: మూడు రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News April 23, 2025
పహల్గామ్ దాడి.. కావలి వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు!

పహల్గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.